టీజీ20 లీగ్ టైటిల్ స్పాన్సర్ గా శ్రీనిధి యూనివర్సిటీ... బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- రాష్ట్రంలోని యువ క్రికెట్ ప్రతిభను వెలికితీయడమే ప్రధాన లక్ష్యం
- ఈ నెల 21 నుంచి 8 ఫ్రాంచైజీ జట్లతో తొలి సీజన్ ప్రారంభం
- విజేతకు కోటి, రన్నరప్కు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ
- ప్రారంభ వేడుకల్లో సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ కన్సర్ట్
తెలంగాణలో యువ క్రికెట్ ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ టీ20 లీగ్' (టీజీ20 లీగ్ 2026)కు ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. ఈ లీగ్కు శ్రీనిధి యూనివర్సిటీ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు జాతీయ స్థాయి గుర్తింపు, మెరుగైన అవకాశాలు కల్పించడమే ఈ లీగ్ ప్రధాన ఉద్దేశం.
ఈ నెల 21న 'టీజీ20' లీగ్ తొలి సీజన్ ప్రారంభం కానుంది. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు ఈ టోర్నమెంట్లో తలపడనున్నాయి. ప్రారంభ మ్యాచ్లో పాలమూరు స్ట్రైకర్స్, అన్విత్ ఖమ్మం ఏసెస్ జట్లు పోటీపడతాయి. హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు తమ తొలి మ్యాచ్ను జూన్ 23న ఆడనుంది. ఉప్పల్ స్టేడియంతో పాటు నగరంలోని ఇతర ప్రధాన మైదానాల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి.
ఈ లీగ్లో ఐపీఎల్ నిబంధనలనే అమలు చేస్తున్నప్పటికీ, 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనను మాత్రం మినహాయించారు. టోర్నీ విజేతకు రూ. కోటి, రన్నరప్కు రూ. 50 లక్షలు, మూడు మరియు నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు చెరో రూ. 25 లక్షల చొప్పున ప్రైజ్ మనీ అందజేయనున్నారు. క్రికెట్ అభిమానులను ప్రోత్సహించేలా టికెట్ ధరలను కేవలం రూ. 50, రూ. 100గా నిర్ణయించారు.
బుధవారం ట్యాంక్ బండ్పై నిర్వహించనున్న ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. 21వ తేదీన తొలి మ్యాచ్కు ముందు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ కన్సర్ట్, లేజర్ షో వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉంటాయని టీజీ20 లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ఆగం రావు తెలిపారు. విజయ్ దేవరకొండ స్టార్డమ్ ఈ లీగ్కు మరింత ప్రచారం తీసుకువస్తుందని, యువ క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ నెల 21న 'టీజీ20' లీగ్ తొలి సీజన్ ప్రారంభం కానుంది. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు ఈ టోర్నమెంట్లో తలపడనున్నాయి. ప్రారంభ మ్యాచ్లో పాలమూరు స్ట్రైకర్స్, అన్విత్ ఖమ్మం ఏసెస్ జట్లు పోటీపడతాయి. హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు తమ తొలి మ్యాచ్ను జూన్ 23న ఆడనుంది. ఉప్పల్ స్టేడియంతో పాటు నగరంలోని ఇతర ప్రధాన మైదానాల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి.
ఈ లీగ్లో ఐపీఎల్ నిబంధనలనే అమలు చేస్తున్నప్పటికీ, 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనను మాత్రం మినహాయించారు. టోర్నీ విజేతకు రూ. కోటి, రన్నరప్కు రూ. 50 లక్షలు, మూడు మరియు నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు చెరో రూ. 25 లక్షల చొప్పున ప్రైజ్ మనీ అందజేయనున్నారు. క్రికెట్ అభిమానులను ప్రోత్సహించేలా టికెట్ ధరలను కేవలం రూ. 50, రూ. 100గా నిర్ణయించారు.
బుధవారం ట్యాంక్ బండ్పై నిర్వహించనున్న ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. 21వ తేదీన తొలి మ్యాచ్కు ముందు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ కన్సర్ట్, లేజర్ షో వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉంటాయని టీజీ20 లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ఆగం రావు తెలిపారు. విజయ్ దేవరకొండ స్టార్డమ్ ఈ లీగ్కు మరింత ప్రచారం తీసుకువస్తుందని, యువ క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.